PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం: చింత సురేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని జనసేన పార్టీ పాణ్యం నియోజకవర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబు అన్నారు. అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా పాణ్యం నియోజకవర్గ పరిధిలో కల్లూరు లోని ఇందిరమ్మ కట్ట వద్దనున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.  ఈ సందర్భంగా చింత సురేష్ బాబు మాట్లాడుతూ ఎంతటి కష్టమైనా .. పనైనా.. చిత్తశుద్ధితో.. పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేద్కర్ జీవితం నేర్పిస్తుందన్నారు.  కుల వివక్ష ఎదుర్కొన్న ఎక్కడ వెనకడుగు వెయ్యలేదని, ఆయన రచనలు ప్రపంచానికి ఆలోచింపజేశాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ ముఖ్య నాయకులు పిబీవీ సుబ్బయ్య , మంజునాథ్, యాశపోగు బజారి, ఆకేపోగు రాంబాబు, రెడ్డి పోగు కృష్ణ బాబు, సుధాకర్, సతీష్, విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

About Author