PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంబులెన్స్ ప్రమాద బాధితులకు మండిపల్లి ఆపన్న హస్తం

1 min read

– బాధితుల చికిత్స నిమిత్తం రూ.50,000/- లు మత గురువుకు అందజేత
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పీలేరు వద్ద సోమవారం ఆంబులెన్స్ ప్రమాదానికి గురైన ఆంబులెన్స్ డ్రైవర్, అందులో చికిత్స కోసం వెళుతున్న ఇద్దరు మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో వేలూరు సి.యం.సి. లో చికిత్స నిమిత్తం డబ్బులు అవసరం ఉండటంతో రాయచోటి ముస్లిం మత గురువు, రాయచోటి సర్ఖాజి కోరడంతో రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి వెంటనే స్పందించి బాధితుల సహాయార్థం తన వంతు ఆర్థిక సహాయంగా రూ. 50,000/- లు రాయచోటి ముస్లిం మతగురువును స్వయంగా కలిసి అందజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు అనునిత్యం అందుబాటులో ఉంటూ కులమతాలకు అతీతంగా వారికి సేవచేస్తున్నానని, నా ప్రయాణం ఉన్నంత వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటానని మండిపల్లి అన్నారు. మరిన్ని డబ్బులు అవసరమైతే సమకూరుస్తానని ఆయన మత గురువుకు హామీ ఇచ్చారు.

About Author