PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తీరంలోకి వచ్చిన అమెరికా యుద్ధనౌక

1 min read
am

ప‌ల్లెవెలుగు వెబ్: అమెరికా యుద్ధనౌక భారత జ‌లాల్లో ప్రవేశించింది. ఎలాంటి అనుమ‌తి లేకుండా ల‌క్షదీవుల స‌మీపంలోని భార‌త జ‌లాల్లోకి ప్రవేశించిన‌ట్టు అధికారులు తెలిపారు. అమెరికా మాత్రం ‘స్వేచ్చాయుత నౌకాయాన హక్కు’ ను చాటేందుకు భార‌త జ‌లాల్లోకి ప్రవేశించిన‌ట్టు స‌మాధానం చెప్పింద‌ని అధికారులు తెలిపారు. అమెరికా నౌక ప్రవేశాన్ని భార‌త్ వ్యతిరేకించింది. అంత‌ర్జాతీయ చ‌ట్టాల ప్రకారం భార‌త జలాల్లో ప్రవేశించాల‌న్నా స‌రే.. భార‌త్ అనుమ‌తి త‌ప్పనిస‌రి అని భార‌త అధికారులు స్పష్టం చేశారు. భార‌త్, అమెరికా మ‌ధ్య సోద‌ర వాతావ‌ర‌ణం ఉన్నప్పటికీ.. ఇలా చేయ‌డం స‌రికాద‌ని భార‌త అధికారులు తెలిపారు.

About Author