PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమిత్ షా మ‌ఫ్ల‌ర్ ధ‌ర రూ. 80 వేలు పైనే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర మంత్రి అమిత్‌ షా ధరించే మఫ్లర్‌ ధర రూ.80 వేలకు పైనే ఉంటుందని.. బీజేపీ నేతలు ధరించే సన్ గ్లాసెస్ ధర రూ. 2.50 లక్షలకు పైనే ఉంటుందని రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్రతో బీజేపీ నేతలకు వచ్చిన ఇబ్బంది ఏమిటని నిలదీశారు. ‘‘బీజేపీ నేతలు రూ.2.50 లక్షల సన్ గ్లాసెస్, రూ.80 వేల మఫ్లర్‌లు ధరిస్తూ.. రాహుల్ గాంధీ టీ షర్ట్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధరించే మఫ్లర్ ధర రూ.80 వేలకుపైనే ఉంటుంది. అయినా టీ షర్టులపై బీజేపీ రాజకీయాలు చేస్తోంది”.. అని గెహ్లాట్ మండిపడ్డారు.

                                                      

About Author