PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : టీడీపీ అధినేత చంద్రబాబుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. ఇటీవ‌ల ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అమిత్ షా అపాయింట్ మెంట్ కోరారు. క‌శ్మీర్ ప‌ర్యట‌న‌, ఇత‌ర ప‌ర్యట‌న‌ల కార‌ణంగా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలో కశ్మీర్ ప‌ర్యట‌న అనంత‌రం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు. ఏపీలో టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు, ఇత‌ర‌త్రా విష‌యాలు ఫోన్ లో అమిత్ షాకు చంద్రబాబు వివ‌రించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం న‌డుస్తోంది ఈ సంద‌ర్భంగా అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. గంజాయికి వ్యతిరేకంగా టీడీపీ పోరాడుతుంటే వైసీపీ దాడులు చేస్తోంద‌ని చంద్రబాబు అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

About Author