NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమిత్ షా ప‌ర్య‌ట‌న‌లో ఆగంత‌కుడు.. ఆల‌స్యంగా వెలుగులోకి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముంబై పర్యటనలో భద్రతా లోపం ఏర్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హోంశాఖ అధికారిని అంటూ హేమంత్ పవార్ అనే వ్యక్తి హోంశాఖ ఐడీకార్డుతో గంటల తరబడి షాకు అతి సమీపంలో తిరిగాడు. అంతేకాదు తాను బందోబస్తు చూసేందుకు వచ్చానని నమ్మబలికాడు. షా పాల్గొన్న రెండు కార్యక్రమాలకూ హేమంత్ పవార్ వచ్చాడు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసాల వద్ద కూడా కనిపించాడు. హోం మంత్రిత్వ శాఖ జాబితాలో హేమంత్ పవార్ పేరు లేదని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదురోజుల పోలీస్ కస్టడీ విధించింది.

                                                  

About Author