NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక్కరికే ‘అమ్మఒడి’..అందరికీ ‘తల్లికి వందనం’

1 min read

అకౌంట్లలో డబ్బులు పడుతుంటే విష ప్రచారం

తల్లిని గౌరవించలేని వ్యక్తి జగన్..

పాత్రికేయుల సమావేశంలో నందికొట్కూర్ ఎమ్మెల్యే..

నందికొట్కూరు, న్యూస్ నేడు:  ఆనాడు జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్కరికే అమ్మ ఒడి..ఈనాడు మా ప్రభుత్వ హయాంలో బడికి వెళ్లే పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ అందించామని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చామని 2019-24 వరకు అమ్మ ఒడి 2 వేల రూపాయలు జగన్ జోబులోకా లేక ప్యాలెస్ లోకి వెళ్ళాయా అని వీటికి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించారు.తల్లిని గౌరవించలేని వ్యక్తి తల్లుల అకౌంట్లో డబ్బులు పడుతుంటే అక్కసు పట్టుకోలేక లేనిపోని విష ప్రచారాలకు తెరతీసారని జగన్ పాలనలో దాదాపు 42 లక్షల మందికి అంటే 67.27 శాతం మంది విద్యార్థులకు మాత్రమే అమ్మ ఒడి వేశారని అన్నారు.ఇచ్చిన మాట ప్రకారం ఈనాడు రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి వైపు వెళ్తుందని పేద బడుగు బలహీన వర్గాల వారిని తప్పుదోవ పట్టించొద్దని ఎమ్మెల్యే జయసూర్య  సూచించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు జాకీర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి,రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్,మండల కన్వీనర్లు కాత రమేష్ రెడ్డి, పలుచాని మహేశ్వర రెడ్డి, తలముడిపి వంగాల శివరామిరెడ్డి పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *