PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బారిసంఖ్యలో డా. ఆకుమళ్ళ. నాని ని కలిసిన మహిళలు 

1 min read

పల్లెవెలుగు వెబ్  విజయవాడ: ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పధకంప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని డా. ఆకుమళ్ళ.నాని మహిళలకు తెలియజేశారు. పటమట పంటకాల్వ రోడ్డు రాష్ట్ర యం. బి. సి. కార్యాలయం నందు ఉభయ రాష్ట్రాల యం.బి.సి.గౌరవ అధ్యక్షులు సేవారత్న డా. ఆకుమళ్ళ.నాని  ని వివిధ ఏరియాల నుంచి బారిసంఖ్యలో డా. ఆకుమళ్ళ. నాని  ని కలిసిన మహిళా టైలర్స్ మరియూ ఇతర చేతి వృత్తిదారుల పాల్గొని డా.ఆకుమళ్ళ.నాని కి వారి  సమస్యలను వివరిస్తూ రేపు 17 న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పధకం ద్వారా మాకు కూడా లోన్ మంజూరు అయ్యేలా చేయమని నాని  ని కోరడం జరిగింది.  తదనంతరం డా. ఆకుమళ్ళ. నాని వారి తో మాట్లాడుతూ ముందుగా ఈ పధకం అమలు చేస్తున్న శ్రీ గౌరవ నీయులు మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర.మోడీ గారు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 17 న ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పధకం ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు హాజరై ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని డా. ఆకుమళ్ళ.నాని  మహిళలకు తెలియజేశారు. తప్పకుండా మీ సమస్యలపై కేంద్రమంత్రి  దృష్టికి తీసుకు వెళ్ళి సాధ్యమైనంత వరకు మీకు అందరి కి లోన్ మంజూరు చేసేలా చేస్తానని అన్నారు అందుకే  అందరూ ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నాని  కోరారు.

 

About Author