PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్వేయర్లలో.. జోష్​

1 min read
లాప్​టాప్​ అందజేస్తున్న కలెక్టర్​ ఇంతియాజ్​

లాప్​టాప్​ అందజేస్తున్న కలెక్టర్​ ఇంతియాజ్​

– 53 మందికి లాప్​టాప్​లు అందజేత
– 19 మంది గ్రామసర్వేయర్లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ: కృష్ణా జిల్లాలో ల్యాండ్ రికార్డ్ రీసర్వే వేగవంతం చేయడంలో గ్రామ సర్వేయర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పలువురు సర్వేయర్లకు లాప్ టాప్ లు, విలేజ్ సర్వేయర్లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ అందజేశారు. భూముల సర్వే పారదర్శకంగా నిర్వహిస్తున్నారని, కొత్తగా మరింత మందిని గ్రామ సర్వేయర్లు ను కూడా నియామకం చేసినందున భూముల రీసర్వే అర్థవంతంగా వేగవంతంతో పూర్తి జేయాలని కలెక్టర్​ సూచించారు.

సర్వే సెటిల్ మెంట్ మరియు ల్యాండ్ రికార్డు ఆధ్వర్యంలో 53 మంది మండల సర్వేయర్లు కు లాప్ టాప్ లు అందిస్తుండగా, వాటిలో విజయవాడ రూరల్ కు చెందిన ఏ. రమేష్,పెనమలూరుకు చెందిన టి. శివరామకృష్ణ,విజయవాడ వెస్ట్ కు చెందిన హుమాయన్ బేగ్,విజయవాడ నార్త్ కు చెందిన బి. జ్యోతి, విజయవాడ ఈస్ట్ కు చెందిన ఏ.జగన్ మోహన్ లకు లాప్ టాప్ లను కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు. విల్ జ్ సర్వేయర్లు గా నియమింపబడిన 19 మందిలో కె.కవిత, బి.మీనా, కె.గిరి,కె.కర్రీ,ఎస్.భవాని,యం.కవిత లకు ఉద్యోగ నియామక ఉత్తర్వులను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.మాధవిలత, విజయవాడ సబ్ కలెక్టర్ హెచ్.యం.ధ్యానచంద్ర, సర్వ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.

About Author