PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH


పల్లెవెలుగు‌వెబ్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఇవాళ ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తమిళనాడు, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తిరుపతిలోనూ నిన్న సాయంత్రం కుండపోత వాన పడింది. పట్టణంలో రోడ్లు చెరువులను తలపించాయి. వరద నీరు తిరుపతిని చుట్టుముట్టడంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.

About Author