PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగన్ దుష్టపాలనకు స్వస్తి-బాబు నవశకానికి నాంధీ

1 min read

జిల్లా ప్రజలకు,తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులకు కార్యకర్తలకు, అభిమానులకు సంక్రాంతి శుభాకాంక్షలు

-టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బీటీ.నాయుడు గారు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్రెడ్డి కొనసాగించినటువంటి దుష్టపాలనకు రాష్ట్రంలో స్వస్తిపలుకాలనీ, చంద్రబాబు  స్వర్ణయుగం నవశకానికి నాంధీ పలుకాలనీ తెలుగుదేశంపార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు,శాసనమండలి సభ్యులు బీటీ.నాయుడు  ప్రజానీకానికి పిలుపునిస్తూ..ఈరోజు బోగి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ గత 5 సంవత్సరాలలో తెచ్చినటువంటి అప్రజాస్వామిక చీకటి జి.ఒ.లను,నారా చంద్రబాబు నాయుడు గారిపై జగన్రెడ్డి చేయిస్తున్న అసత్య కరపత్రాలను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలోనీ బోగిమంటల్లో తగులబెట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి పి.జి.నర్సింహులు యాదవ్ తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాసాంస్కృతి క విభాగం అధ్యక్షులు పి హనుమంతరావు చౌదరి సాంస్కృతిక విభాగం ఆర్గనైజ్ సెక్రటరీ పి లక్ష్మి పద్మా చౌదరిమరియు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author