PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉరితాళ్ళతో వినూత్న నిరసన..

1 min read

అంగన్వాడీల  వేతనాలు పెంచాలి..

బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరిక.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  అంగన్వాడి కార్మికులకు న్యాయమైన వేతనాలు అందే వరకు సమ్మె కొనసాగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని కార్మికులు కోరుతున్నారని తక్షణమే కనీస వేతనం అమలు చేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ చెల్లించాలని ఎన్ని నిర్భందాలు పెట్టిన సమ్మె కొనసాగుతుందని చర్చలు చేయకుండా బెదిరింపులకు పాల్పడే ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్  (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో సీపీఐ కార్యాలయం నుండి పటేల్ సెంటర్, పొట్టి శ్రీరాములు సర్కిల్ గుండా కార్మికులు ఉరితాళ్ళతో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐసీడిఎస్ కార్యాలయం ముందు గంట పాటు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.రఘురాం మూర్తి,రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న లక్ష మంది అంగన్వాడీ కార్మికులు తమ న్యాయమైన వేతనాల పెంపు పై నాలుగున్నర సంవత్సరాలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తున్నారని, అధికారులను మంత్రులను కలిసి విన్నవిస్తున్నారని అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదన్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇస్తానన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కాలయాపన చేయడం వల్ల కార్మికుల సమ్మెకు దిగారు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రాట్యూటీ ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు..పేస్ యాఫ్ రద్దు చేయాలన్నారు. కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సమ్మెను తప్పుదోవ పట్టించేందుకు అధికార యంత్రంగాం చూడడం తగదు అన్నారు. సమస్యలు పరిష్కరించి సమ్మె విరమించాలణే ప్రయత్నం చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అధికారుల మధ్య విభేదాలు సృష్టించే పద్ధతి మానుకోవాలన్నారు.ఏమైనా సమస్యలు పరిష్కరించేంతవరకు ఎన్ని బెదిరింపులకు పాల్పడిన దౌర్జన్యం చేసిన సమ్మె కొనసాగుతుందని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్  (ఏఐటీయూసీ) యూనియన్ నాయకులు సువర్ణ,పుణ్యవతి, కమలమ్మ,కాత్యాయనీ,మహిళా సమాఖ్య జిల్లా నాయకులు రజితమ్మ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీనివాసులు, జిల్లా నాయకులు మహానంది,వినోద్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

About Author