PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మన గ్రోమోర్ కేంద్రంపై ఇంటర్నల్ స్క్వాడ్ దాడి

1 min read

– సరైన పత్రాలు లేనందున మూసివేత
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: స్థానిక మండల కేంద్రంలో ఉన్న కిసాన్ అగ్రిమాల్ మన గ్రోమోర్ కేంద్రంపై ఇంటర్నల్ స్క్వాడ్ సహాయ వ్యవసాయ సంచాలకులు(ఆత్మకూరు ఏడిఏ)ఆంజనేయులు మరియు వారి బృందం కేంద్రంపై దాడి చేశారు.ఈతనిఖీలో భాగంగా ఎరువులకు సంబంధించి మన గ్రోమోర్ కేంద్రం నందు 1,40,749 ఎం టిఎస్ ఎరువులకు గాను 3,47,97,031 రూపాయలు మరియు కిసాన్ అగ్రిమాల్ నందు 32.517 ఎంటిఎస్ గాను 11,27,522 రూపాయలు ఎరువులలో వ్యత్యాసాలు రావడం అంతేకాకుండా సరైన పత్రాలు లేనందున ఈ గ్రోమోర్ షాపును సరైన పత్రాలు చూపించేంతవరకు షాపును తెరవకూడదని ఎలాంటి అమ్మకాలు కూడా చేయకూడదని వారు షాపును మూసి వేయించారు.ఈవిషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతూ ఉందని వారు తెలిపారు.అంతేగాకుండా మండలంలో ఎవరైనా సరే నకిలీ ఎరువులు మరియు సరైన పత్రాలు లేనట్లయితే మాదృష్టికి తీసుకు వచ్చినట్లయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి ఎం.పీరు నాయక్ తెలిపారు.

About Author