PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో ఆనందయ్య మందు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరంలో నెల్లూరు ఆనందయ్య మందును ఉచితంగా పంపిణీ చేశారు బీజేపీ నాయకుడు రంజిత్​ కుమార్​ కర్ణి. వీపార్క్​ ఫౌండేషన్​ నేతృత్వంలో శని, ఆదివారాలలో దాదాపు 500 మందికి ఉచితంగా ఆనందయ్య ఆయుర్వేదిక్​ మెడిసన్​ను అందజేశారు. కరోన రాకుండా ఉండేందుకు మందు వాడాలని సూచించిన రంజిత్​కుమార్​ కర్ణి… మొదటిసారి మందు వేసుకున్నాక… పది రోజుల తరువాత మరోసారి వేసుకోవాలని సూచించారు. మందు వేసుకున్న తరువాత పది రోజుల వరకు మద్యం, మాంసం తీసుకోరాదని సూచించినట్లు రంజిత్​ కుమార్​ ప్రజలకు వివరించారు. ఆనందయ్య మందును ప్రత్యేకంగా తెప్పించి.. ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నామని, త్వరలో మళ్లీ తీసుకొచ్చి … పంపిణీ చేస్తామన్నారు.

About Author