PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చలో అనంతపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

1 min read

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం : అనంతపురం లో నిర్వహిస్తున్న న్యాయ నిర్మాణం సభ చలో అనంతపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాబురావు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ స్వామి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ ఏపి లో పదేళ్లు టిడిపి, వైకాపా ప్రభుత్వాలు, దేశంలో బిజెపి అధికారంలో ఉన్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయడం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభలో ప్రత్యేక హోదా, అమరావతి నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చి ఇంత వరకు నేరవేర్చలేదన్నారు. జగన్ ఎన్నికల ముందు 25 ఎంపిలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత నాదే అని చెప్పి అధికారంలోకి రాగానే కేసులకు భయపడి అడగడం లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అనంతపురం లో నిర్వహిస్తున్న న్యాయ నిర్మాణం సభ కు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సిడబ్ల్యుసి మెంబర్స్ రఘువీరారెడ్డి, రాజు, గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి శైలజ నాథ్, ఏపి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి 30 వాహనాలలో కార్యకర్తలు తరలివస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి భరత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి షేక్ అబ్దుల్ హై, మంత్రాలయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాలకృష్ణ స్వామి, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ హుస్సేన్, పత్తికొండ ఇన్చార్జ్ క్రాంతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author