PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనంత‌పురం.. క‌ట‌క‌టాల్లోకి ఎస్ఐ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : తిరుపతి జిల్లా చంద్రగిరి ఎస్‌ఐ రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ను శనివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతపురం జిల్లా పామిడి మండలం గురుమాంజనేయ కొట్టాలకు చెందిన ఎస్‌.సరస్వతి (21) ఆత్మహత్యకు కారణమైన నేప‌థ్యంలో అరెస్టు జ‌రిగింది. వివ‌రాల‌ను తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గురుమాంజనేయ కొట్టాల గ్రామానికే చెందిన రమావత్‌ విజయ్‌కుమార్‌ నాయక్‌ 2018లో ఎస్‌ఐగా ఎంపికయ్యాడు. ప్రస్తుతం చంద్రగిరిలో పనిచేస్తున్నాడు. వరుసకు మామ కూతురైన సరస్వతిని రెండేళ్లుగా ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. అనంతపురానికి చెందిన భారతితోనూ ప్రేమాయణం నడిపాడు. ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కడంతో భారతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ విజయ్‌కుమార్‌ తనను వంచించడంతో సరస్వతి మనస్తాపానికి గురై బుధవారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ విజయ్‌కుమార్‌పై 420, 376, 306 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పామిడిలో శనివారం అతన్ని అరెస్టు చేశారు.

                                  

About Author