NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యాంక‌ర్ ప‌ద‌వికి.. ఎంపీ రాజీనామా !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :శివసేన ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది సంస‌ద్ టీవీ యాంక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. శీతాకాల స‌మావేశాల్లో రాజ్యస‌భ నుంచి స‌స్పెండ్ అయిన త‌ర్వాత ఆమె ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘వికృత’ ప్రవర్తనపై రాజ్యసభ నుంచి పదకొండు మందితో పాటు ఆమెను కూడ‌ సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ షో నుంచి వైదొలిగారు. సంసద్ టీవీ షో మేరీ కహానీ యాంకర్‌గా వైదొలగడం త‌న‌కు తీవ్ర వేదన కల్పించిందని ఆమె అన్నారు. త‌మ‌ 12 మంది ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన కారణంగా పార్లమెంటరీ విధులను నిర్వర్తించ లేకపోయానని, అందుకే తాను రాజ్యసభ టీవీ యాంకర్‌గా తప్పుకుంటున్నానని ఆమె చైర్మన్ వెంక‌య్య నాయుడుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

About Author