PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆంధ్రా బ‌స్సులు ర‌ద్దు..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ నుంచి ఆంధ్రాకు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను టీఎస్ఆర్టీసీ ర‌ద్దు చేసింది. అడ్వాన్స్డ్ రిజ‌ర్వేష‌న్ కూడ ర‌ద్దు చేసింది. ఆంధ్రాలో క‌ర్ఫ్యూ విధించిన నేప‌థ్యంలో ఆ టైమింగ్స్ లో బ‌స్సులు తిర‌గ‌డం సాధ్యం కాని సంద‌ర్బంలో తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌, శ్రీశైలం, బెంగ‌ళూరు, తిరుప‌తి వెళ్లే బ‌స్సుల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఈనెల 6 నుంచి 18 వ‌ర‌కు ఏపీకి వెళ్లే బ‌స్సులు మొత్తం నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. క‌రోన క‌ట్టిడి కోసం ఏపీ ప్రభుత్వం క‌ర్ఫ్యూ విధించింది. మ‌ధ్యాహ్నం 12 నుంచి ఉద‌యం 6 వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఏపీ మొత్తం అమ‌ల‌వుతుంది. కాబ‌ట్టి.. ఈ స‌మ‌యానికి అనుగుణంగా తెలంగాణ ఆర్టీసీ బ‌స్సులు ఏపీకి వ‌చ్చి వెళ్లే అవ‌కాశం లేదు. ఈ నేప‌థ్యంలో టీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

About Author