PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమ్మకానికి ఆంధ్రా కంపెనీ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీకి చెందిన కంపెనీని ఎస్బీఐ అమ్మకానికి పెట్టింది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్ నుంచి రావాల్సిన రూ. 26.73 కోట్ల బకాయిలు రాబట్టేందుకు కంపెనీని అమ్మాలని ఎస్బీఐ నిర్ణయించింది. ఆస్తుల పునర్‌ వ్యవస్థీకరణ కంపెనీలు (ఏఆర్‌సీ), బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు, ఆర్థిక సంస్థలు ఈ ఆస్తుల కోసం పోటీపడవచ్చని తెలిపింది. వచ్చే నెల 4వ తేదీన వేలం ద్వారా ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌ ఆస్తులు ‘స్విస్‌ ఛాలెంజ్‌’ పద్దతిలో వికయ్రించనున్నట్టు తెలిపింది. ఆంధ్రా ఫెర్రో అల్లాయ్స్‌తో పాటు మరో ఐదు కంపెనీలను ఎస్‌బీఐ ఈ వేలం ద్వారా విక్రయించనుంది. ఈ ఆరు కంపెనీల నుంచి ఎస్‌బీఐకి మొత్తం రూ.406 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది.

        

About Author