NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులు క‌ట్టడం లేదు..

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కృష్ణా న‌ది నీటిని త‌ర‌లించేందుకు ఆంధ్ర ప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులు క‌డుతోంద‌న్న తెలంగాణ ఆరోప‌ణ‌లు స‌రికాద‌ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్​ స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాజెక్టుల‌న్నీ చ‌ట్టానికి లోబ‌డి క‌డుతున్నవే అని ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోప‌ణ‌లు ప‌స‌లేనివ‌ని కొట్టిపారేశారు. ఆంధ్రకు కేటాయించిన నీరు త‌ప్ప… అక్రమంగా చుక్క నీరు కూడ వాడుకోవ‌డం లేద‌ని తెలిపారు. 6 టీఎంసీల నిల్వ చేసే ప్రాజెక్టులు తెలంగాణ అక్రమంగా క‌డుతోంద‌ని విమ‌ర్శించారు. పోతిరెడ్డి పాడు వ‌ద్ద లిప్ట్ పెడితే .. త‌ప్పెలా అవుతుంద‌ని ప్రశ్నించారు. శ్రీశైలంలో 881 అడుగుల‌కు నీరి చేరితే పోతిరెడ్డి పాడు నుంచి త‌ర‌లించే అవ‌కాశం ఉంద‌ని, 848 అడుగుల నీటి మ‌ట్టం ఉంటే చుక్క నీరు కూడ తీసుకోలేమ‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

About Author