NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అల్టిమేటం ప్రతులను దగ్ధం చేసిన అంగన్వాడీలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: సమ్మె తమ హక్కు అని గత 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్న తమపై ప్రభుత్వం కనికరించకపోగా ఈనెల 5వ తేదీ కల్లా విధులకు హాజరుకావాలని లేకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడం ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అర్థం పడుతుందని (గడివేముల) మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు అల్టిమేటం ప్రతులను దగ్ధం చేసిన అంగన్వాడిలు. ప్రభుత్వ బెదిరింపు ధోరణులకు లొంగబోమని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు రాములమ్మ.. వసంతలక్ష్మి . రామ చేన్నమ్మ.తదితరులు పాల్గొన్నారు.

About Author