PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా అన్న సమారాధన

1 min read

ప్రారంభించిన  టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ బడేటి చంటి

సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక  29వ డివిజన్ కుమ్మరి రేవు వద్ద వేంచేసియున్న శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గుడి వద్ద సుబ్రహ్మణ్యం షష్టి వేడుకల్లో భాగంగా స్థానికలు, నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బడేటి రాధాకృష్ణయ్య (చంటి). ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ ఇటువంటి దైవ కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, తద్వారా మనమందరం ఒకే వేదికపై సహబంతి భోజనాలుతో ఒకరినొకరు ప్రేమపూర్వకంగా కల్మషాలు లేకుండా ఆప్యాయతతో కలుసుకోవడం జరుగుతుందన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, అమ్మ సేవా ట్రస్ట్ చైర్మన్ మారం హనుమంతరావు, మాజీ ప్రజా ప్రతినిధులు టీడీపీ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

About Author