PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీశైలంలో అన్నదానం..

1 min read

పల్లెవెలుగు వెబ్​:ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం యాదవ  నిత్య అన్నదాన సత్రం నందు నంద్యాల నివాసి గొర్ల సత్యనారాయణ యాదవ్ గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక మాసం చివరి సోమవారం రోజున యాదవ నిత్య అన్నదాన సత్రం నందు తన సొంత ఖర్చులతో సుమారు వెయ్యి మందికి అన్నదానము చేయడము సంప్రదాయంగా కొనసాగుతున్నది. అందులో భాగంగా సోమవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు గొర్ల సత్యనారాయణ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాత మాట్లాడుతూ  కొన్ని సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ కుమార్ డాక్టర్ పాండురంగారావు ఎస్ పార్థసారథి కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కొనియాడారు.

About Author