PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్తీక మాసంలో అన్నదానం పుణ్యకార్యం

1 min read

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు, వెబ్ చెన్నూరు : కార్తీక మాసంలో శివాలయాలకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో పుణ్యకార్యం అని కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం వద్ద వెలసిన శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివాలపలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్, రామ సుబ్బారెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక సమాజంలో శివాలయాల వద్ద స్వామి అమ్మవార్లను దర్శించుకునే భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచి పుణ్య కార్యముని ఆయన తెలియజేశారు, అంతకుముందు శ్రీ కాశి విశ్వనాథ ఆలయంలో శ్రీ కాశీ విశ్వ నాద స్వామి, శ్రీ విశాలాక్షి అమ్మవార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించారు, అనంతరం ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్ జి శివారెడ్డి ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మా సిమ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్( చిన్న), జిఎన్ భాస్కర్ రెడ్డి, సర్పంచులు ముమ్మడి సుదర్శన్ రెడ్డి, సొంట్టం నారాయణరెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, ఎంపీటీసీ నాగిరెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు పెద్ద పుల్లయ్య, సురతాని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author