PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాఠశాలలకు సెలవు ప్రకటించండి

1 min read
మాట్లాడుతున్న హరీష్​ కుమార్​

మాట్లాడుతున్న హరీష్​ కుమార్​

_ ఏఐడీఎస్​ఓ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించాలని ఏఐడీఎస్​ఓ రాష్ట్ర కార్యదర్శి వి. హరీష్ కుమార్ రెడ్డి విద్యాశాఖ అధికారులను డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ప్రతి రోజు 8వేల కేసులు నమోదవుతున్నాయని, ఇందులో విద్యార్థులే అధికంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదోని కేజీబీ స్కూల్​లో 52 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్​ రాగా , దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డి కేజీబీలో 35 మంది విద్యార్థులకు పాజిటివ్​ వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్​, విద్యాశాఖ అధికారులు స్పందించి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఏయిడెడ్​, కేజీబీ పాఠశాలల్లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించాలని కోరారు. సమావేశంలో AIDSO జిల్లా ఇంచార్జీ పి. విశ్వనాథ్ రెడ్డి, మరియు ప్రియాంక, మనోహర్ పాల్గొన్నారు.

About Author