PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నామినేటెడ్ ప‌ద‌వుల ప్రక‌ట‌న !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీలోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల‌ను ప్రక‌టించారు. ప్రభుత్వ స‌ల‌హాదారు స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి, హోంమంత్రి మేక‌తోటి సుచ‌రిత నామినేటెడ్ ప‌ద‌వుల జాబితాను ప్రక‌టించారు. 135 కార్పొరేష‌న్లు, వాటిలో చైర్మన్లను, డైరెక్టర్లను నియ‌మించారు. ప‌ద‌వులేవీ అలంకార‌ప్రాయం కాద‌ని స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. ఈ ప‌ద‌వుల పంప‌కంలో సామాజిక న్యాయం పాటించామ‌ని ఆయ‌న అన్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీల‌కు 76 ప‌ద‌వులు కేటాయించామ‌ని తెలిపారు. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు 56 శాతం ప‌ద‌వులు కేటాయించామ‌ని తెలిపారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్దపీఠ వేశామ‌ని చెప్పారు.

About Author