PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మ‌రో ప్రాణాంత‌క వైర‌స్ వెలుగులోకి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మరో ప్రమాదకర ప్రాణాంత‌క వైర‌స్ బ‌య‌ట‌ప‌డింది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో అతి ప్రాణాంతకమైన ‘మార్బర్గ్‌’ వైరస్‌ వెలుగు చూసింది. రెండు కేసులు బయటపడినట్లు ఆదివారం ఘనా అధికారికంగా ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం మరణించిన ఇద్దరు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్‌ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. జులై 10నే పాజిటివ్‌గా తేలినప్పటికీ.. ఫలితాలను మరోమారు తనిఖీ చేసేందుకు సెనెగల్‌లోని ల్యాబ్‌కు పంపించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ‘సెనెగల్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ పాస్టెర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా తేలింది’ అని ఘనా ఆరోగ్య విభాగం ప్రకటన చేసింది.

                                                       

About Author