NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో మ‌రో స్కామ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో మ‌రో స్కామ్ వెలుగులోకి వ‌చ్చింది. రూ.2,060 కోట్ల భారీ రుణ ఖాతాను మోసపూరితమైనదిగా గుర్తించింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ తమిళనాడు పవర్‌ ఖాతాను నిరర్థక రుణ ఖాతా (ఎన్‌పీఏ)గా ప్రకటించింది. ఢిల్లీ జోనల్‌ ఆఫీస్‌ పరిధిలోని ‘ఎక్స్‌ట్రా లార్జ్‌ కార్పొరేట్‌ బ్రాంచ్‌’ పరిధిలో ఇది జరిగినట్టు తెలిపింది. ఈ ఖాతాకు సంబంధించి ఆర్‌బీఐకి రిపోర్ట్‌ చేసినట్టు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి ఈ ఖాతాకు రూ.824 కోట్ల కేటాయింపులు చేసినట్టు పేర్కొంది.

                                  

About Author