PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ మండల ఉపాధ్యక్షులుగా అన్వర్ భాష

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు వైసీపీ మండల ఉపాధ్యక్షులు(వైస్ ప్రెసిడెంట్)గా మొల్ల అన్వర్ భాష నియమితులయ్యారు.ఈ మేరకు వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలకు పూర్తి కమిటీల పేర్లను ప్రకటించింది.గతంలో వైసీపీ మండల కన్వీనర్ల పేర్లను మాత్రమే ప్రకటించిన కేంద్ర పార్టీ కార్యాలయం ఇప్పుడు ఏకంగా మండల కమిటీని ప్రకటించింది.వైసీపీ మండల కన్వీనర్ గా తువ్వా లోకేశ్వర రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.కడుమూరు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు అన్వర్ భాష పార్టీకి విధేయుడుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు.ఈ మండల కమిటీలో నాగ శేసిరెడ్డి,జనరల్ సెక్రటరీగా చిన్న పుల్లారెడ్డి,వెంకటేశ్వర్లు, బైరాపురం సర్పంచ్ ఫణి భూషణ్ రెడ్డి,కోశాధికారి రాజేషయ్య మరియు కార్యదర్శులుగా ఐదు మందిని, సభ్యులుగా 15 మందిని పార్టీ నియమించింది. ఉపాధ్యక్షులుగా నాకు పదవి రావడానికి కృషిచేసిన గ్రామ నాయకులు విశ్వం రెడ్డి,శంకర్ రెడ్డి,శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author