PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆందోళ‌నల‌తో మొద‌లైన ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.

                                          

About Author