PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తగ్గించాలని కోరితే బూతులు తిడతారా?: సోమువీర్రాజు

1 min read


పల్లెవెలుగు వెబ్: పెట్రో, డీజిల్ ధరల అంశం వైసీపీ, బీజేపీ మధ్య కాక పుట్టిస్తోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పందించారు. పెట్రో, డీజిల్ ధరలు తగ్గించాలని కోరితే వైసీపీ మంత్రులు బూతులు తిట్టడం ఏంటని ప్రశ్నించారు. పెట్రోలు అంశంపై సర్కార్ మొండిగా వ్యవహరిస్తోందన్నారు. వెంటనే ధరలు తగ్గించాలని ఆయన…. సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీ… భారత్‌లో ఉందా? లేక పాకిస్తాన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన తప్పులతడకగా ఉందని ఎద్దేవా చేశారు. రూ.25 విలువ చేసే చీప్‌ లిక్కర్‌ బాటిల్‌ను రూ.250కి విక్రయిస్తూ పేద ప్రజలను దోచుకుంటున్నారని… తిరిగి ఆ డబ్బులే పథకాల రూపంలో ప్రజలకు పంచిపెడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు.

About Author