NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ సరిహద్దులు బంద్

1 min read

పల్లెవెలుగు వెబ్: రేపట్నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు కానుంది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. మధ్యాహ్నం 12 తర్వాత ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనాలు బంద్ అవ్వనున్నాయి. మధ్యాహ్నం 12 తర్వాత రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయనున్నారు. అకారణంగా బయట తిరిగే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని సూచించారు. సంస్థలు, కార్యాలయాలు కూడా ఆంక్షలు పాటించాలని చెప్పారు.

About Author