NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. వచ్చే నెల 7 నుంచి బడ్జెట్ సమావేశాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 7 నుంచి ప్రారంభంకానున్నాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15నుంచి 20 పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మార్చి 7న.. తొలిరోజు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల అసెంబ్లీలో సంతాపం తెలియజేయనున్నారు. 8న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. మార్చి 11 లేదా 14న ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

            

About Author