NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ.. స్మార్ట్ సిటీల చైర్మ‌న్లు రాజీనామా

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని స్మార్ట్ సిటీల చైర్మ‌న్లు త‌మ ప‌దవుల‌కు రాజీనామా చేశారు. తిరుపతి, ఏలూరు, విశాఖ, కాకినాడ స్మార్ట్ సిటీల చైర్మన్లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ జి.వెంకటేశ్వర రావు, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ ఏ.రాజు బాబు, ఏలూరు స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ బి.అఖిల, తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ ఎన్. పద్మజలు తమ పదవులకు రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ మిషన్లకు నామినేటెడ్ నియామకాలు చెల్లవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏపీ ప్రభత్వానికి లేఖ రాసింది. దీంతో తక్షణం రాజీనామాలు చేయించాలని గత డిసెంబర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేఖ రాసింది. ఈ మేరకు స్మార్ట్ సిటీ మిషన్ చైర్మన్లతో ప్రభుత్వం రాజీనామాలు చేయించింది.

                             

About Author