NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ పై .. ఏపీ సీఐడీ కేసు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ పై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 10 హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నవ నిర్మాణ్ నగర్ లోని రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తున్న తరుణంలో ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ తో పాటు మరికొందరు తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ పేర్కొంది. సీఐడీ విభాగం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న జేవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై మంగళగిరి ప్రధాన పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ 353,341, 186,120బీ రెడ్ విత్ 34 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ తో పాటు న్యాయవాది జీవీజీ నాయుడు, ఏబీఎన్ వీడియో గ్రాఫర్ ఎన్. రమేష్, ఏబీఎన్ రిపోర్టింగ్ ఏజెంట్ సోమపల్లి చక్రవర్తి రాజును నిందితులుగా పేర్కొన్నారు.

About Author