PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ కో ఆపరేటివ్​ సర్వీస్​ అసోసియేషన్​ జిల్లా కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్​: నగరంలోని ఏపీ కో ఆపరేటివ్​ ఎంప్లాయిస్​ సీఎస్​డి ఎస్  కృష్ణానగర్​ కార్యాలయంలో శనివారం ​ఆ సంఘం జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అసోసియేషన్​ కమిటీలో మొత్తం 48 మంది సభ్యులు ఉండగా అందులో 45  మంది ఎన్నికలో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి టి. నాగరమణయ్య, ఎం, వెంకటేశ్వర్లు పోటీ చేయగా… టి. నాగరమణయ్య ప్యానెల్​ 39 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించింది. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా నుంచి అసిస్టెంట్​ రిజిష్ట్రార్​ ఎం. రమణారెడ్డి వ్యవహరించారు.  టి. నాగమరణయ్య 5వ సారి  అధ్యక్ష పదవికి ఎన్నిక కావడంతో సభ్యులు ఘనంగా సన్మానించారు. అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా పి. లక్ష్మికాంత్​ రెడ్డి, అసోసియేట్​ ప్రెసిడెంట్​ ఎం. రామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు  జి. రామకృష్ణ, జిల్లా జాయింట్​ సెక్రటరి పి. సుజాత, జాయింట్​ సెక్రటరి జనరల్​ ఎం. శ్రీనివాసులు, ​ ట్రెజరర్​ కె.శ్రీకాంత్,  జూనియర్​ అసిస్టెంట్​ క్యాడర్​ సెక్రటర్లు బ్రహ్మ య్య ఆచారి, ఖలీల్​ ఉల్లా షరీఫ్​ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఏపీ కో ఆపరేటివ్​ సర్వీస్​ అసోసియేషన్​ జిల్లా కమిటీ అధ్యక్షుడు టి. నాగరమణయ్య మాట్లాడుతూ కో ఆపరేటివ్​ లో అర్హత ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని, ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా నాగరమణయ్య పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.

About Author