PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటమి తప్పదని తెలిసే… గగ్గోలు: సజ్జల

1 min read


పల్లెవెలుగు వెబ్: ఎయిడెడ్ కాలేజీల అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకుంటోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాల వివాదంలో అరాచక శక్తులు దూరాయన్నారు. దీనిపై నారా లోకేష్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తప్పదని తెలుసుకున్న చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. 2014-19లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన దౌర్జన్యం అందరికీ తెలుసని.. ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఎయిడెడ్ కాలేజీల విలీనాలపై బలవంతం ఏమీ లేదని సజ్జల స్పష్టం చేశారు.

About Author