PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌జ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 62.70 లక్షల మంది లబ్దిదారులకు గొప్ప అవకాశం కల్పించింది. ఇకపై లబ్ధిదారుడు తన పెన్షన ఓ చోట నుంచి మరో చోటుకి మార్చుకునే వెసులుబాటు కల్పించింది. లబ్దిదారులు తమ నివాసాన్ని ఒకచోట నుంచి మరొక చోటుకి మార్చుకునే టైంలో ఆ వివరాలతో గ్రామ, వార్డు సచివాలయంలోదరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీనికి తోడు ఇకపై ఎవరైనా అనర్హులకు పెన్షన్లు మంజూరు చేస్తే.. అది పొరపాటు అయినా.. కావాలి అని చేసినా.. అలా మంజూరు చేసిన అధికారి నుంచే.. ఆ సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ రూల్ పెట్టింది ప్రభుత్వం. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నుండి పెన్షన్ ను పెంచే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా కుప్పంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న పెన్షన్ 2, 750కి పెంచుతామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగా వనరులు సమకూర్చే పనిలో ఉన్నారు అధికారులు.

                                          

About Author