PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అయోధ్య రామాల‌యం నిర్మాణంలో ఏపీ గ్రానైట్ రాళ్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో అయోధ్య ఆలయ నిర్మాణం జరుగుతోంది. తాజాగా ట్రస్టు ఆలయ నిర్మాణ పనులపై ప్రకటన చేసింది. గర్భగుడితో పాటు ఐదు మండపాల నిర్మాణం వేగంగా సాగుతోందని వెల్లడించింది. 6.5 మీటర్ల ప్లింత్ బీమ్ నిర్మాణం పూర్తయిందని, దానిపైనే రామ మందిర ప్రధాన కట్టడం రూపుదిద్దుకోనుందని తెలిపింది. ఈ ప్లింత్ నిర్మాణం కోసం ఇంజినీర్లు గ్రానైట్ రాళ్లను ఎంపిక చేశారని తెలిపింది. ఇందుకోసం 17,000 గ్రానైట్ రాళ్లను వినియోగించారని, వీటిని ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న గ్రానైట్ గనుల నుంచి తెప్పించినట్టు ట్రస్టు వివరించింది. ఈ గ్రానైట్ రాళ్లు నాణ్యతలో అత్యున్నతమైనవని పేర్కొంది. బెంగళూరుకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ వీటి నాణ్యతను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసిందని ట్రస్టు వెల్లడించింది.

                                                 

About Author