NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆ విష‌యంలో ఏపీకి అన్యాయం జ‌రిగింది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద ఆంధ్రప్రదేశ్‌లోని 60 శాతం బీపీఎల్‌ కుటుంబాలకే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తూ అన్యాయం చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు విమర్శించారు. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో 76 శాతం బీపీఎల్‌ కుటుంబాలకు పంపిణీ చేస్తోందని తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్గాని భరత్‌రామ్‌ మాట్లాడుతూ కేంద్రానికి సంబంధం లేకుండా 24 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోందని తెలిపారు. ప్రజా పంపిణీ, ఆహార భద్రత పథకాల కింద ఏపీకి పంపిణీ చేస్తున్న బియ్యానికి, కేంద్రం చెబుతున్న లెక్కలకు పొంతనలేదన్నారు. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు.

                                              

About Author