PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ.. ఇంటర్ పరీక్షలు వాయిదా !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను గురువారం వెల్లడించింది. ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్సాల్సి ఉంది. కాగా జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కాగా ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం యధావిధిగా మార్చి 11 నుంచి 31 వరకు జరుగనున్నాయి.

         

About Author