PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయ రాఘవేంద్రడి సేవలో ఏపీ మంత్రి శంకర్​నారాయణ

1 min read

పల్లెవెలుగువెబ్​, కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్​నారాయణ ఆదివారం రాఘవేంద్రస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి సేవార్థం వచ్చిన మంత్రి శంకర్​నారాయణకు మంఠాధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. రాఘవేంద్రుడి సన్నిధిలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. పూజా కార్యక్రమాలు ముగిశాక మఠాధిపతి మంత్రిని శేషవస్త్రాలు, ప్రసాదాలతో సత్కరించారు. అనంతరం మంత్రి ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్​ను కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలు, త్వరలో జరగబోవు కేబినేట్​ విస్తరణ వంటి అంశాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశంలో హిందూపూర్​ ఎంపీ గోరంట్ల మాదవ్​, తదితరులు ఉన్నారు.

About Author