PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భూవివాదంలో మహిళా మంత్రి

1 min read


పల్లెవెలుగు వెబ్: ఏపీ మంత్రి తానేటి వనితను ఓ భూ వివాదం చుట్టుముట్టింది. తాడేపల్లిలో 25 సెంట్ల భూమిపై శివానంద మఠానికి మంత్రి మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని మంత్రి భావిస్తున్నారు. ఇటీవల ఆ స్థలంలో భూమి పూజ కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ స్థలం తమ వంశస్తులకు చెందిందని, దానిపై పూర్తి హక్కులు తమవేనని బండి రామస్వామి అనే వ్యక్తి స్థలానికి సంబంధించిన పత్రాలు చూపించారు. దీనిపై మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ….2014లో ఈ స్థలాన్ని మేడపాటి మురళీ మోహన్ రెడ్డి దగ్గర కొనుగోలు చేశానన్నారు. స్థలానికి సంబంధించిన 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ తమ వద్ద ఉన్నాయన్నారు. ఆందోళన చేస్తున్న వారి దగ్గర డాక్యుమెంట్లు లేవని.. . రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ గొడవ చేస్తున్నారంటూ మంత్రి తానేటి వనిత అన్నారు.

About Author