NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ పై ఏపీ మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఎన్టీఆర్‌తో వైఎస్ఆర్‌కు పోలిక లేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు. ఈ సందర్భంగా దివంగత ఎన్టీఆర్‌పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెన్నుపోటు పొడిపించుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ వెన్నుపోటుతో పదవిని కోల్పోయిన అసమర్థుడు ఎన్టీఆర్ అని దాడిశెట్టి రాజా అన్నారు. అందుకే ఎన్టీఆర్, వైఎస్ఆర్ మధ్య పోలిక లేదని తాను చెబుతున్నానని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని దాడిశెట్టి రాజా వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ పేదల ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని మంత్రి దాడిశెట్టి అన్నారు.

                                    

About Author