PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ పాస్టర్స్ ఫెడరేషన్ తాత్కాలిక కేంద్ర జిల్లా కార్యాలయం ప్రారంభం..

1 min read

పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ , జనరల్ సెక్రెటరీ  జీవన్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న డయాసిస్ బిషప్ లు, దైవజనులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  స్థానిక ఫైర్ స్టేషన్ గ్రాండ్ ఆర్య హోటల్ ఫ్రంట్ క్యాబిన్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ తాత్కాలిక కేంద్ర , ఏలూరు జిల్లా కార్యాలయాన్ని మంగళవారం ఉదయం ఆర్సీఎం డయాసిస్ బిషప్ డా రెవ జయరావు పొలిమేర , ఐసిఎం డయాసిస్ బిషప్ రెవ డా ఎన్ జేఎస్ డి రాజు, బిగ్ డయాసిస్ బిషప్ రెవ.డా కె శాంతి సాగర్ , హోటల్ గ్రాండ్ ఆర్య ఎండి రాఘవయ్య చౌదరి లు ప్రారంభించారు.ఈసందర్భంగా పాస్టర్స్ ఫెడరేషన్ కు కార్యా లయాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఫౌండర్ , జనరల్ సెక్రెటరీ రెవ పి. జీవన్ కుమార్ ను పలువురు పాస్టర్ లు అభినందించారు. అలాగే జీవన్ కుమార్ మణిపూర్ లో క్రైస్తవులపై జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి రచించి, స్వరపరచిన పాటను ఆవిష్కరించారు. అనంతరం పాస్టర్ జీవన్ కుమార్ బిషప్ లను ఘనంగా సన్మానించారు. ఈకార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షులు రెవ.ఇ.రత్న ప్రసాద్ , సెక్రటరీ రెవ.జోసెఫ్ చిక్కాల ,రెవ. విజయానంద్ ,వైస్ ప్రెసిడెంట్ రెవ.కరుణ బాబు, వైస్ ప్రెసిడెంట్ రెవ జి. జాన్ పీటర్, రెవ ఎన్ఎల్. పాల్, రెవ. రాజేష్, రెవ పీవీ రాజు ,రెవ ఎస్ కె. రక్షణ పాల్, రెవ. జయరాజు ,రెవ.జెర్మియా, రెవ. రాజారావు ,రెవ ఆర్ జయరాజు, రెవ వి.రాజ్ కుమార్ ,రెవ. జాషువా, రెవ. మరియన్న ,రెవ. మధు ,రెవ. అబ్రహాము , పెదపాడు మండలం, దెందులూరు మండలం, ఏలూరు మండలం, పెదవేగి మండలం, భీమడోలు మండలలాల నుండి మరికొందరు దైవజనులు నగర ప్రముఖులు పాల్గొన్నారు.

About Author