PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ జ‌నం.. క‌ర్ణాట‌క‌కు క్యూ క‌డుతున్నారు !

1 min read

పల్లెవెలుగు వెబ్ :ఆంధ్ర- క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో చిత్రమైన ప‌రిస్థితి నెల‌కొంది. ఏపీకి చెందిన వాహ‌నదారులు క‌ర్ణాట‌క పెట్రోల్ బంకుల వ‌ద్దకు క్యూ క‌డుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పెట్రోల్ ధరల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో వాహనదారులు కర్ణాటక పెట్రోల్ బంకులకు వెళ్తున్నారు. కర్ణాటక పెట్రోల్ బంకులు పక్క పక్కనే వంద మీటర్ల దూరంలో ఉండడంతో వాహనదారులు అక్కడికే వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఏపీకి స‌రిహ‌ద్దుగా ఉన్న క‌ర్ణాట‌క ప్రాంతంలో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఇంత తేడా ఎందుకు ఉంద‌ని ప‌లువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పెట్రోల్ ,డీజిల్ పై టాక్స్ ను త‌గ్గించాల‌ని కోరుతున్నారు.

About Author