PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ పీజీసెట్ ఫ‌లితాలు విడుద‌ల

1 min read

పల్లెవెలుగు వెబ్ : ఏపీ పీజీసెట్ ఫ‌లితాల‌ను విద్యాశాఖమంత్రి ఆదిమూల‌పు సురేష్ విడుద‌ల చేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్‌ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించామ‌ని ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఆన్‌లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించామని చెప్పారు. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారని.. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారని తెలిపారు.

About Author