PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయంలో ఏపి రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ శ్యామ్ సుందర్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆదోని : మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ శ్యామ్ సుందర్ గురువారం సాయంత్రం మంత్రాలయం విచ్చేశారు. వీరికి ముందుగా శ్రీ మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి మఠం వారు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ గారు ఎమ్మిగనూరు జడ్జి గురు అరవింద స్వామి, తాసిల్దార్ దేవ చంద్ర శేఖర్, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ మూర్తి స్వామి, ఎస్ఐ వేణుగోపాల్ రాజు, తదితరులు ఉన్నారు.

About Author