NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిందరి మార్కుల వివరాలను https://cse.ap.gov.in/DSE/ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత 58.07 శాతం మంది టెట్ లో అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు.

                                   

About Author