PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ.. రుతుప‌వ‌నాల రాక నేడే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీని రుతుప‌వ‌నాలు సోమ‌వారం తాక‌నున్నాయి. కేరళ నుంచి గుజరాత్‌ వరకు అరేబియా సముద్ర తీరం వెంబడి ద్రోణి విస్తరించింది. ఇంకా అరేబియ సముద్రం నుంచి పడమర గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తర్వాత రెండు రోజులు రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

                                            

About Author